ఉత్తమ పురస్కారాలు పొందిన, అవార్డు గ్రహీతలకు సన్మానం
ఉత్తమ పురస్కారాలు పొందిన, అవార్డు గ్రహీతలను సన్మానించిన టిడిపి సీనియర్ నేత బుడ్డయ్య
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న అధికారులను విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు బుడ్డయ్య ఘనంగా సన్మానించారు.
తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్న కుమార్ జిల్లాలో ఉత్తమ ఆర్డీవో అవార్డును, విస్సన్నపేట తహశీల్దార్ కె. లక్ష్మీ కుమారి జిల్లాలో ఉత్తమ తహశీల్దార్ అవార్డును, విస్సన్నపేట ఎంపీడీవో చేకు చిన్నారావు జిల్లాలో ఉత్తమ ఎంపీడీవో అవార్డులను అందుకున్నారు.
విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్నీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ సమక్షంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న అధికారులను బుడ్డయ్య అభినందిస్తూ, విస్సన్నపేట మండలానికి మంచి పేరు తీసుకువచ్చారని ప్రశంసించారు. అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.