ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో భద్రతా లోపం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో భద్రతా లోపం
CM కాన్వాయ్ వెళ్తుండగా పేలుడు
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటనలో భద్రతా లోపం కలకలం రేపింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కోసం మథుర వచ్చిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి హోటల్కు బయలుదేరారు. మార్గమధ్యలో చేతన్య విహార్ ఓవర్బ్రిడ్జ్ వద్ద ఆయన కాన్వాయ్ వెళ్తుండగా విద్యుత్ వైర్లలో ఒక్కసారిగా భారీ శబ్దంతో విస్ఫోటనం సంభవించింది. సీఎంతో పాటు ఉన్న అధికారుల భద్రతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.