BREAKING
పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
www.ntodaynews.com

వచ్చే ఎన్నికల్లో ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:45 PM
8 వీక్షణలు

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ‘మావిగన్ వర్సెస్ అమరావతి’ అజెండాతోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల అమరావతికి ప్రత్యామ్నాయంగా ‘మావిగన్’ పేరుతో నూతన రాజధాని కారిడార్ ప్రతిపాదనను జగన్ ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మావిగన్ అజెండాపై తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని, ఇదే తమ ఎన్నికల నినాదమని తెలిపారు.

"మావిగన్‌కు మేము కట్టుబడి ఉన్నాం. ప్రజలకు మా వైఖరిని వివరిస్తాం. మాకు మద్దతు ఇచ్చే ప్రజలు మాకే ఓటు వేస్తారు. ప్రజల మద్దతు ఎవరికుందో ఎన్నికల్లో తేలిపోతుంది" అని జగన్ పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో ‘అమరావతి నమూనానా? లేక మావిగన్ అజెండానా?’ అనే అంశంపైనే ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని ఆయన అన్నారు. ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని, ఎవరి విధానానికి ప్రజలు మద్దతు ఇస్తారో ఎన్నికల ఫలితాల్లో స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు.

జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం హాట్‌టాపిక్‌గా మారింది. రానున్న ఎన్నికల్లో అమరావతి అభివృద్ధి, మావిగన్ ప్రతిపాదన ప్రధాన రాజకీయ చర్చాంశాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.