BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వడ్డెర్లకు మైనింగ్ లీజులు... యువగళం హామీకి న్యాయం చేసిన మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 01:19 PM
109 వీక్షణలు

వడ్డెర్లకు మైనింగ్ లీజులు... యువగళం హామీకి న్యాయం చేసిన మంత్రి నారా లోకేశ్

రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గ అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వారి సంప్రదాయ వృత్తిని ప్రోత్సహిస్తూ, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

పాదయాత్ర సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడ్డెర వర్గానికి చెందిన ప్రజలు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. రాళ్లు కొట్టడం, మట్టి పనులు వంటి తమ సంప్రదాయ వృత్తులకు అనుగుణంగా ప్రభుత్వ భూముల్లో మైనింగ్ లీజులు ఇస్తే జీవనోపాధి మెరుగుపడుతుందని కోరారు. ఆ సమయంలో స్పందించిన లోకేశ్, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆ హామీ ప్రకారమే ఇటీవలి కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపాదనగా తీసుకువచ్చిన నారా లోకేశ్, వడ్డెర వర్గం ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. దీనిపై సమగ్రంగా చర్చించిన మంత్రివర్గం, సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు, విధివిధానాలతో త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయనుంది.

యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న లోకేశ్, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది వడ్డెర కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.