BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

వడ్డెర్లకు మైనింగ్ లీజులు... యువగళం హామీకి న్యాయం చేసిన మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 01:19 PM
44 వీక్షణలు

వడ్డెర్లకు మైనింగ్ లీజులు... యువగళం హామీకి న్యాయం చేసిన మంత్రి నారా లోకేశ్

రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గ అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వారి సంప్రదాయ వృత్తిని ప్రోత్సహిస్తూ, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

పాదయాత్ర సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడ్డెర వర్గానికి చెందిన ప్రజలు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. రాళ్లు కొట్టడం, మట్టి పనులు వంటి తమ సంప్రదాయ వృత్తులకు అనుగుణంగా ప్రభుత్వ భూముల్లో మైనింగ్ లీజులు ఇస్తే జీవనోపాధి మెరుగుపడుతుందని కోరారు. ఆ సమయంలో స్పందించిన లోకేశ్, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆ హామీ ప్రకారమే ఇటీవలి కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపాదనగా తీసుకువచ్చిన నారా లోకేశ్, వడ్డెర వర్గం ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. దీనిపై సమగ్రంగా చర్చించిన మంత్రివర్గం, సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు, విధివిధానాలతో త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయనుంది.

యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న లోకేశ్, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది వడ్డెర కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.