BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

వెలుగు పేరిట చీకటి దోపిడి..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 04:30 PM
55 వీక్షణలు

వెలుగు మాటున చీకటి జాడలు..!

మహిళల పొదుపు సొమ్ముల మాయం సేవ పేరుతో సొమ్ముల సఫాయం..! వెలుగు అధికారుల దందా బయటపడ్డదా? 

ముచ్చినపల్లి మహిళల పొదుపు సొమ్ములు మాయం – వెలుగు అధికారులపై తీవ్ర ఆరోపణలు

రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలో “వెలుగు” పేరుతో వెలుగులు నింపాల్సిన వ్యవస్థే… మహిళల జీవితాల్లో చీకట్లు నింపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా కష్టపడి రూపాయి రూపాయిగా పొదుపు చేసిన సొమ్ములు… ఒక్కసారిగా ఖాతాల నుంచి మాయమవ్వడం స్థానిక మహిళలను ఆందోళనకు గురిచేసింది.

“మాకు చెప్పకుండా… మా సంతకాలు లేకుండా… మా ఖాతాల్లోని డబ్బు ఎలా బయటకు వెళ్లింది?” అంటూ బాధిత మహిళలు బ్యాంకులు, అధికారుల ఎదుట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

ఒకప్పుడు “మీ కష్టానికి మేముంటాం… మీ జీవితాల్లో వెలుగు నింపుతాం…” అంటూ ప్రభుత్వ హామీలతో ప్రారంభమైన వెలుగు కార్యక్రమం, ఇప్పుడు అదే మహిళల కష్టార్జితాన్ని మింగేస్తోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రుణాలు, స్వావలంబన పేరుతో మహిళలను సంఘటితం చేసి, వారి నమ్మకాన్ని గెలుచుకున్న వ్యవస్థలోనే… ఈ విధమైన అక్రమాలు వెలుగుచూడటం సంచలనంగా మారింది. అధికారుల నిర్లక్ష్యమా? లేక వ్యవస్థలోనే దాగి ఉన్న అవినీతికి ఇది నిదర్శనమా? అన్నది తేలాల్సి ఉంది.

“పొదుపు చేసిన డబ్బు కూడా సురక్షితం కాకపోతే… మేమెవరిని నమ్మాలి?” అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.