BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వెలుగు పేరిట చీకటి దోపిడి..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 04:30 PM
96 వీక్షణలు

వెలుగు మాటున చీకటి జాడలు..!

మహిళల పొదుపు సొమ్ముల మాయం సేవ పేరుతో సొమ్ముల సఫాయం..! వెలుగు అధికారుల దందా బయటపడ్డదా? 

ముచ్చినపల్లి మహిళల పొదుపు సొమ్ములు మాయం – వెలుగు అధికారులపై తీవ్ర ఆరోపణలు

రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలో “వెలుగు” పేరుతో వెలుగులు నింపాల్సిన వ్యవస్థే… మహిళల జీవితాల్లో చీకట్లు నింపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా కష్టపడి రూపాయి రూపాయిగా పొదుపు చేసిన సొమ్ములు… ఒక్కసారిగా ఖాతాల నుంచి మాయమవ్వడం స్థానిక మహిళలను ఆందోళనకు గురిచేసింది.

“మాకు చెప్పకుండా… మా సంతకాలు లేకుండా… మా ఖాతాల్లోని డబ్బు ఎలా బయటకు వెళ్లింది?” అంటూ బాధిత మహిళలు బ్యాంకులు, అధికారుల ఎదుట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

ఒకప్పుడు “మీ కష్టానికి మేముంటాం… మీ జీవితాల్లో వెలుగు నింపుతాం…” అంటూ ప్రభుత్వ హామీలతో ప్రారంభమైన వెలుగు కార్యక్రమం, ఇప్పుడు అదే మహిళల కష్టార్జితాన్ని మింగేస్తోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రుణాలు, స్వావలంబన పేరుతో మహిళలను సంఘటితం చేసి, వారి నమ్మకాన్ని గెలుచుకున్న వ్యవస్థలోనే… ఈ విధమైన అక్రమాలు వెలుగుచూడటం సంచలనంగా మారింది. అధికారుల నిర్లక్ష్యమా? లేక వ్యవస్థలోనే దాగి ఉన్న అవినీతికి ఇది నిదర్శనమా? అన్నది తేలాల్సి ఉంది.

“పొదుపు చేసిన డబ్బు కూడా సురక్షితం కాకపోతే… మేమెవరిని నమ్మాలి?” అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.