www.ntodaynews.com
విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బుధవారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' లో భాగంగా రామన్నపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది ప్రయోగాత్మకంగా వివరించారు. ప్రమాద సమయంలో భయపడకుండా ధైర్యంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. మంటలను ఆర్పే వివిధ పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట లీడింగ్ ఫైర్ ఫైటర్ బికు, డి.ఓ.పి నూతి కాశీరాం, ఫైర్ ఫైటర్లు అమనగంటి కృష్ణ, వెంకటేష్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.