BREAKING
శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
www.ntodaynews.com

విజయ దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజ ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
25 వీక్షణలు

కడప, జూన్ 9:

“అమ్మా అని పిలిస్తే, నేనున్నా” అని పలికే చల్లని తల్లి మన కడప శ్రీ విజయదుర్గా దేవి సన్నిధిలో మంగళవారం రాహుకేతు పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు.

వేకువ జామున పంచామృత అభిషేకం ద్వారా అమ్మవారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శనం అందజేయగా, మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు రాహు కాల పూజ నిర్వహించారు. గ్రహాలు పరాశక్తి శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆధీనంలో ఉన్నందున, అమ్మవారి సన్నిధిలో ఈ పూజలు చేయడం వల్ల భక్తులకు అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం వ్యక్తమైంది. భక్తులు పూజల్లో పాల్గొని మనసుని తీరుస్తూ సంతోషం పొందారు.

అలాగే, ఈ నెల 14వ తేదీన శ్రీ విజయదుర్గామల్లికార్జునుల శాంతి కళ్యాణం వైభవంగా జరగనుందని, 16వ తేదీ జేష్ట శుద్ధ విదియ నుండి జూలై 29వ తేదీ ఆషాఢ పౌర్ణమి వరకు ఆలయంలో విజయదుర్గా దేవి మండలదీక్ష (మాలధారణ) కార్యక్రమం నిర్వహించబడనుందని ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మల్లికార్జున రావు, నిర్వాహకులు దుర్గా ప్రసాద్ తెలిపారు.

అందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.