BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్‌లో డీసీపీ తనిఖీలు – రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 08:47 PM
74 వీక్షణలు

విజయవాడ భవానిపురం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం డీసీపీ గుణ్ణం రామకృష్ణ తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి, భవానిపురం ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిపై సమగ్రంగా చర్చించారు.

వర్షాకాలం నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలు, ఈదురు గాలులు, భారీ వర్షాల సమయంలో ప్రజలకు కలిగే ఇబ్బందులు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై డీసీపీ సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

అనంతరం రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తిగత సమస్యలు ఉంటే పోలీసులకు తెలియజేయాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని సూచించారు.

కుటుంబ బాధ్యతలను గుర్తించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా కష్టపడి పనిచేసి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. సత్ప్రవర్తనతో మెలిగితే భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పించేందుకు అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఐ ఉమామహేశ్వరరావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.