BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 01 June 2026, 06:16 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
01 Jun, 2026 - 06:16 PM
89 వీక్షణలు

విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు  ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు నిర్వహించారు. 

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే సమస్యను వారు ఎలా పరిష్కరిస్తున్నారు వంటి అంశాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని, సమస్యలు పునరావృతం కాకుండా  శాశ్వత పరిష్కారాన్ని అందించాలని అన్నారు.


ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 19 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు  పై 6 ఫిర్యాదులు నమోదు కాగా, రెవెన్యూ 2, ఇంజనీరింగ్ 9, ప్రజారోగ్య శాఖలకు సంబంధించిన 1, పి ఓ యుసిడి 1 పలు సమస్యలను కూడా ప్రజలు అదనపు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. 


ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ సి హెచ్ రత్న బాబు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, బయాలజిస్ట్ ఏజే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి

విజయవాడ నగరపాలక సంస్థ