www.ntodaynews.com
విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడలో ఈ నెల 21న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగర పోలీసు కమిషనర్ ఎం. రాజశేఖర్ బాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర కలిసి స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వేదిక నిర్మాణం, ప్రజలకు సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.