BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

విజయవాడలోఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 08:47 PM
11 వీక్షణలు

విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డిసిపి షిరీన్ బేగం పర్యవేక్షణలో వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా 5వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి.వి. రమణ తన సిబ్బందితో కలిసి బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ హాల్లో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, పాఠశాల విద్యార్థులను స్కూల్ ఆటోలలో సురక్షితంగా రవాణా చేయాల్సిన అవసరం, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ప్రతి వాహనదారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు సూచించారు. రహదారి వినియోగదారుల భద్రత కోసం బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని స్పష్టం చేశారు.

అనంతరం ఆటో డ్రైవర్లు మరియు ఆటో యూనియన్ నాయకులతో ట్రాఫిక్ నియమాలు పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో 5వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ డి.వి. రమణ, ఎస్‌ఐ మురళి రెడ్డి, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మరియు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.