www.ntodaynews.com
విసన్నపేట మండలం పురుగు మందులు, విత్తనాలు, ఎరువుల షాపుల తనిఖీ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విసన్నపేట మండలం లో ఈరోజు జిల్లా వ్యవసాయాధికారి డి.యమ్.ఎఫ్. విజయ కుమారి పలు పురుగుమందులు మరియు విత్తనాల షాపులను తనిఖీ చేశారు.
తనిఖీ లో భాగంగా ఎరువుల షాపుల్లో యూరియా మరియు డి.ఏ.పి నిల్వలను, రిజిస్టర్ లను పరిశీలించారు. ఎరువుల అమ్మకాలు తప్పనిసరిగా ఏపీఎంఎస్ (APMS) యాప్ ద్వారా జరగాలని, యాప్ లో నమోదు లేకుండా అమ్మకాలు జరుపుతున్న ఎరువుల డీలర్లపై తగు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో విసన్నపేట సహాయ వ్యవసాయ సంచాలకులు కే శశికళ మరియు మండల వ్యవసాయాధికారి జీ.రాజ్యలక్ష్మీ కూడా పాల్గొన్నారు.