www.ntodaynews.com
విస్సన్నపేటలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో ట్రాఫిక్ నియంత్రణపై సీఐ గిరిబాబు, ఎస్ఐ అర్జున్ రాజ్ కీలక సూచనలు చేశారు. దుకాణాల ముందు వాహనాలు నిలిపేందుకు స్థలం లేకుండా చేయడం వల్ల రోడ్లపై బండ్లు నిలపాల్సిన పరిస్థితి ఏర్పడి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని వారు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి దుకాణదారుడు తన షాప్ ముందర వాహనాలు నిలిపే స్థలం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.