www.ntodaynews.com
విస్సన్నపేటలో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విస్సన్నపేటలో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఏర్పాటు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఘనంగా కార్యక్రమం
(ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట)
తెలుగు భాషా పరిరక్షణకు కృషి చేయాలనే లక్ష్యంతో విస్సన్నపేటలో తెలుగు భాషా పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విస్సన్నపేట లయన్స్ క్లబ్లో జరిగిన కార్యక్రమం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి1 మాసగిరి శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో తెలుగు సాహితీ సమితి పేరుతో అనేక భాషా, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సమితి పేరును తెలుగు భాషా పరిరక్షణ సమితిగా మార్చి, తెలుగు తల్లి సాక్షిగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. తెలుగు భాష అభివృద్ధి, పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో జగ్గవరపు రంగారెడ్డి, ముంగా జయరాజు, అంగిడి బక్కయ్య, పోలవరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, సూరిరాజు తదితరులు పాల్గొన్నారు.