BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 11:37 AM
68 వీక్షణలు

ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని పలు విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల లైసెన్సులు, ఫారాలు, ఇన్వాయిస్లు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.

విత్తనాల నిల్వలు వచ్చిన వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలని డీలర్లకు సూచించారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో లాట్ నంబర్, పంట పేరు, వెరైటీ లేదా హైబ్రిడ్ వివరాలను బిల్లులో నమోదు చేసి, డీలర్‌తో పాటు రైతు సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.

నాసిరకం లేదా లూజు విత్తనాల విక్రయాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు లైసెన్సు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి, బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పంట కాలం పూర్తయ్యే వరకు ఆ బిల్లును భద్రంగా ఉంచుకోవాలన్నారు.

ప్రత్తి సహా ఇతర పంటల విత్తనాలను అనధికారికంగా లూజుగా విక్రయిస్తే వాటిని నకిలీ విత్తనాలుగా పరిగణించి, సమాచారం అందిన వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు లూజు విత్తనాల కొనుగోలుకు దూరంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా, వివిధ వరి విత్తనాల నమూనాలను నాణ్యత పరీక్షల కోసం విత్తన పరీక్షా కేంద్రాలకు పంపిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ వెల్లడించారు.