BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

విశాఖలో గంజాయితో పట్టుబడ్డ కానిస్టేబుల్…

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:05 PM
89 వీక్షణలు

విశాఖలో గంజాయితో పట్టుబడ్డ కానిస్టేబుల్… 10 కిలోల గంజాయి, కారు సీజ్

విశాఖపట్నంలో గంజాయి అక్రమ రవాణా వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఈ కేసులో కానిస్టేబుళ్లే నిందితులుగా బయటపడటం సంచలనంగా మారింది. పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రవాణాకు వినియోగించిన కారును సీజ్ చేశారు.

ఈ ఘటనలో ఇద్దరు విజయనగరం జిల్లా కానిస్టేబుళ్లు ఉండగా, మరొకరు ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుల్ శివప్రసాద్‌గా గుర్తించారు. గతంలో నేరాలకు పాల్పడిన కారణంగా శివప్రసాద్‌ను సేవల నుంచి తొలగించినట్లు సమాచారం.

రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో విభాగంలో అంతర్గత పర్యవేక్షణ, క్రమశిక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.