BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 19 March 2026, 10:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విశాఖలో గంజాయితో పట్టుబడ్డ కానిస్టేబుల్…

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:05 PM
165 వీక్షణలు

విశాఖలో గంజాయితో పట్టుబడ్డ కానిస్టేబుల్… 10 కిలోల గంజాయి, కారు సీజ్

విశాఖపట్నంలో గంజాయి అక్రమ రవాణా వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఈ కేసులో కానిస్టేబుళ్లే నిందితులుగా బయటపడటం సంచలనంగా మారింది. పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రవాణాకు వినియోగించిన కారును సీజ్ చేశారు.

ఈ ఘటనలో ఇద్దరు విజయనగరం జిల్లా కానిస్టేబుళ్లు ఉండగా, మరొకరు ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుల్ శివప్రసాద్‌గా గుర్తించారు. గతంలో నేరాలకు పాల్పడిన కారణంగా శివప్రసాద్‌ను సేవల నుంచి తొలగించినట్లు సమాచారం.

రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో విభాగంలో అంతర్గత పర్యవేక్షణ, క్రమశిక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.