విశాఖలో గంజాయితో పట్టుబడ్డ కానిస్టేబుల్…
విశాఖలో గంజాయితో పట్టుబడ్డ కానిస్టేబుల్… 10 కిలోల గంజాయి, కారు సీజ్
విశాఖపట్నంలో గంజాయి అక్రమ రవాణా వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఈ కేసులో కానిస్టేబుళ్లే నిందితులుగా బయటపడటం సంచలనంగా మారింది. పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రవాణాకు వినియోగించిన కారును సీజ్ చేశారు.
ఈ ఘటనలో ఇద్దరు విజయనగరం జిల్లా కానిస్టేబుళ్లు ఉండగా, మరొకరు ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుల్ శివప్రసాద్గా గుర్తించారు. గతంలో నేరాలకు పాల్పడిన కారణంగా శివప్రసాద్ను సేవల నుంచి తొలగించినట్లు సమాచారం.
రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో విభాగంలో అంతర్గత పర్యవేక్షణ, క్రమశిక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.