BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

విశాఖలో గంజాయితో పట్టుబడ్డ కానిస్టేబుల్…

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:05 PM
128 వీక్షణలు

విశాఖలో గంజాయితో పట్టుబడ్డ కానిస్టేబుల్… 10 కిలోల గంజాయి, కారు సీజ్

విశాఖపట్నంలో గంజాయి అక్రమ రవాణా వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఈ కేసులో కానిస్టేబుళ్లే నిందితులుగా బయటపడటం సంచలనంగా మారింది. పోలీసులు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రవాణాకు వినియోగించిన కారును సీజ్ చేశారు.

ఈ ఘటనలో ఇద్దరు విజయనగరం జిల్లా కానిస్టేబుళ్లు ఉండగా, మరొకరు ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుల్ శివప్రసాద్‌గా గుర్తించారు. గతంలో నేరాలకు పాల్పడిన కారణంగా శివప్రసాద్‌ను సేవల నుంచి తొలగించినట్లు సమాచారం.

రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో విభాగంలో అంతర్గత పర్యవేక్షణ, క్రమశిక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.