www.ntodaynews.com
విశాఖను డ్రగ్స్ కేంద్రంగా మార్చారు....
ఆంధ్రప్రదేశ్
విశాఖను డ్రగ్స్ కేంద్రంగా మార్చారు.. వైఎస్సార్సీపీ నేత కేకే రాజు ఆరోపణలు
విశాఖపట్నం: అమరావతిని అవినీతికి అడ్డాగా, విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చారని వైఎస్సార్సీపీ నేత కేకే రాజు ఆరోపించారు. నగరంలో భూ దోపిడీ, నీటి సమస్యలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.
విశాఖలోని పలు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా భూ ఆక్రమణలు, డ్రగ్స్ నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కింగ్ జార్జ్ ఆస్పత్రిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కేకే రాజు డిమాండ్ చేశారు.