BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

వరి రైతులకు ముఖ్య సూచన – విత్తన శుద్ధి తప్పనిసరి: బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:41 PM
76 వీక్షణలు

వరి రైతులకు ముఖ్య సూచనలుగా మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ విత్తన శుద్ధి తప్పనిసరి అని స్పష్టం చేశారు. వరి సాగు చేసే రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా షాపు నుండి బిల్లులు పొందాలని ఆయన సూచించారు. అలాగే విత్తనాల మొలక శాతాన్ని ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నారుమడి వేయడానికి ముందు విత్తన శుద్ధి చేయడం అత్యంత అవసరమని పేర్కొన్న ఆయన విత్తన శుద్ధి చేయడం ద్వారా గింజలపై ఉండే కంటికి కనిపించని సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు నశిస్తాయని చెప్పారు. దీంతో ప్రధాన పొలంలో పురుగుమందులు, శిలీంధ్ర నాశకాలు స్ప్రే చేసే ఖర్చు కూడా తగ్గుతుందని వివరించారు. విత్తన శుద్ధికి ట్రైఫ్లోక్సీ స్ట్రోబిన్ 25 శాతం + టేబుకోనజోల్ 50 శాతం మిశ్రమాన్ని 1 కేజీ విత్తనానికి 1 నుండి 1.5 గ్రాములు లేదా కార్బెండజిమ్ 50 శాతం (బావిస్టిన్) ను 1 కేజీ విత్తనానికి 2 నుండి 2.5 గ్రాములు వాడాలని సూచించారు. అలాగే కార్బెండజిమ్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల మోతాదులో ఉపయోగించవచ్చని తెలిపారు. విత్తనాన్ని శుద్ధి చేసిన తరువాత 24 గంటలు ఉంచి ఆపై విత్తుకోవాలని ఆయన సూచించారు. ఈ విధంగా విత్తన శుద్ధి చేయడం ద్వారా బ్లాస్ట్, కుళ్లు వంటి తెగుళ్లు తగ్గి పంటకు ఎటువంటి నష్టం లేకుండా మంచి మొలక శాతం పొందవచ్చని వ్యవసాయ శాఖ పేర్కొంది. కావున రైతులందరూ తప్పనిసరిగా విత్తన శుద్ధి పాటించాలని బి శివశంకర్ సూచించారు.