www.ntodaynews.com
వర్షాల కోసం నెమలి దేవస్థానంలో వరుణ యాగం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో లోకకళ్యాణార్థం సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆలయ ప్రధాన అర్చకులు టీ. గోపాలచార్యులు ఆధ్వర్యంలో వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు.
అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని మహాభారతంలోని విరాటపర్వం పారాయణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతులకు అనుకూలంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ సహాయ కమిషనర్ ఎన్. సంధ్య, వేద పండితులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.