BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 October 2024, 05:09 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అసైన్డ్ భూముల వెరిఫికేషన్, కుల ధృవీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

తెలంగాణ
02 Oct, 2024 - 05:09 AM
385 వీక్షణలు
అసైన్డ్ భూముల వెరిఫికేషన్, కుల ధృవీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.ఏలూరు, భూములు, కుల ధృవీకరణ పత్రాలజారీ అంశాలలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని డివిజనల్ రెవిన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, భూ పరిపాలనా ముఖ్య కమీషనరు జి. జయలక్ష్మి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అసైన్డ్ భూముల ప్రక్రియ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ తనిఖీ, భూములకు సంబంధించి, ప్రజా సమస్యల పరిష్కారవేదికకు సంబంధించిన అర్జీలు, కుల ధృవీకరణ పత్రాల జారీ అంశాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓలు, ఆర్డిఓలతో సమీక్షించి దిశా, నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ జిల్లాలోని రెవిన్యూ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ పై పూర్తిస్ధాయిలో విచారణ చేపట్టి పెండింగ్ అంశాలపై దృష్టిసారించాలని తెలిపారు. ప్రతి అంశాన్ని పూర్తి అవగాహనతోచేపట్టి అర్హులైన వారందరికి న్యాయం చేకూర్చాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భూసమస్యలపై వచ్చే ప్రతి అర్జీని పూర్తిగా అవగాహన చేసుకొని పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈకార్యక్రంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ డి. పుష్పమణి, జిల్లా రిజిష్ట్రారు అధికారులు, ఆర్డిఓలు, కలెక్టరేట్ లోని పరిపాలనా విభాగం సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.