BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 01 September 2026, 06:31 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లిదండ్రులకు న్యాయం కావాలి.. ఆరేళ్ల బాలుడి మౌన పోరాటం బీహార్‌లో పోలీసుల తీరుపై బాలుడి నిరసన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 06:31 AM
18 వీక్షణలు

తల్లిదండ్రులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

పాట్నా: తల్లిదండ్రులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీహార్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ఆదిత్య కుమార్ మౌన దీక్ష చేపట్టాడు. పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొన్నందుకు తన తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కొట్టారని బాలుడు ఆరోపించాడు.

ఆదివారం ప్రారంభించిన ఆదిత్య కుమార్ మౌన దీక్ష రెండో రోజుకు చేరుకోవడంతో ఈ ఘటన బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది. ‘‘నా తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలను’’ అని బాలుడు స్పష్టం చేశాడు.

‘పర్వత మానవుడు’ దశరథ్ మాంఝీ కష్టపడి కొండను తొలిచి దారి నిర్మించినట్లే, తాను కూడా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎదురించి న్యాయం సాధిస్తానని ఆదిత్య వ్యాఖ్యానించాడు.

అసలు ఏం జరిగిందంటే..

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష అభ్యర్థులు ఇటీవల చేపట్టిన నిరసనల్లో ఆదిత్య కుమార్ పాల్గొన్నాడు. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్ఈ-4)లో ఒకే దశ పరీక్ష విధానం అమలు చేయాలని, ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అభ్యర్థులు ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నివాసం ముట్టడికి ప్రయత్నించారు.

ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించినట్లు సమాచారం. పాట్నాలోని గర్దానీబాగ్ ప్రాంతంలో జరిగిన నిరసనలో పాల్గొన్న ఆదిత్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ సమయంలో తన తల్లిదండ్రులపై దాడి చేశారని బాలుడు ఆరోపించాడు.

రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని మీడియాతో మాట్లాడిన ఆదిత్య.. ‘‘నిరసనలో పాల్గొన్నందుకు ఒక పిల్లవాడి తల్లిదండ్రులను కొట్టాలని రాజ్యాంగంలో ఎక్కడ ఉందో చెప్పండి. నా తల్లిదండ్రులకు న్యాయం కావాలి. మా డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తాను’’ అని పేర్కొన్నాడు.