BREAKING
వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
Date of Publish : 01 September 2026, 06:31 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

5న సీజేపీ మార్చ్‌ను అడ్డుకోలేం.. సుప్రీంకోర్టు స్పష్టం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 06:31 AM
53 వీక్షణలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 1, 2026

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఈ నెల 5న ఢిల్లీలో తలపెట్టిన నిరసన ప్రదర్శనను నిలిపివేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసన సమయంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని ముందుగానే ఊహించి ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. శాంతిభద్రతలు, అనుమతుల అంశాలు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉంటాయని పేర్కొంది.

దేశ రాజధానిలోని సున్నిత ప్రాంతాల్లో భారీ నిరసనలు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరిగా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రిటైర్డ్‌ ఢిల్లీ పోలీసు అధికారి రాజేంద్ర సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

అయితే ఈ నెల 5కు ముందే విచారణ చేపట్టాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 10కి వాయిదా వేసింది. విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఇతర కేసులతో కలిపి విచారణ చేపడతామని తెలిపింది.

సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్‌ సదస్సు జరగనున్న నేపథ్యంలో భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల నిరసనను వాయిదా వేయాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నిరసన సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని ముందుగానే అంచనా వేయడానికి కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు కేంద్రం చర్యలు

పరీక్షా పత్రాల లీకేజీ ఆరోపణలపై జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ సీజేపీ ఈ నెల 5న నిరసనకు పిలుపునిచ్చింది.

ఇదిలా ఉండగా, విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించి విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు అనుమతించాలని కేంద్రం కోరుతున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం దిశగా అన్ని పక్షాలు ముందుకు సాగితే తమకు అభ్యంతరం లేదని సీజేపీ పేర్కొంది.

జంతర్‌మంతర్‌ వద్ద జులై 25న విద్యార్థుల ఆందోళన విరమణ సమయంలో సీజేపీ పలు డిమాండ్లు చేసింది. అందులో విద్యార్థులపై నమోదైన కేసుల ఎత్తివేత ప్రధాన అంశంగా ఉంది. కేంద్రం హామీ అమలులో జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ తాజాగా మరో నిరసనకు పిలుపునిచ్చింది.

విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో ఆర్టికల్‌ 142 వినియోగానికి సుప్రీంకోర్టు గతంలో సానుకూలత వ్యక్తం చేసింది. అయితే హత్య, లైంగికదాడి, అపహరణ వంటి తీవ్రమైన నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ అవకాశం వర్తించదని స్పష్టం చేసింది.

మార్చ్‌పై సీజేపీ నుంచి స్పష్టత లేదు

కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం విద్యార్థులపై కేసుల ఉపసంహరణ అంశంలో కీలక పరిణామంగా భావిస్తున్నప్పటికీ, ఈ నెల 5న జరగనున్న నిరసనను విరమిస్తున్నట్లు లేదా మారుస్తున్నట్లు సీజేపీ ఇప్పటివరకు ప్రకటించలేదు. మరోవైపు నిరసనపై తక్షణ ఆంక్షలు విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.