BREAKING
వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
Date of Publish : 01 September 2026, 07:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు.. ఫోన్‌పే కొత్త సదుపాయం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 07:56 AM
13 వీక్షణలు

ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా ఫోన్‌పే ‘యూపీఐ 123పే’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

2జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఎస్‌ఎంఎస్ ఆధారంగా ఈ సేవలు పనిచేస్తాయి. దీంతో దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి రానుంది.

కొత్త ఫోన్లలో యూపీఐ సేవల యాప్ ముందుగానే అందుబాటులో ఉండేలా నోకియా, లావా వంటి మొబైల్ తయారీ సంస్థలతో ఫోన్‌పే ఒప్పందాలు చేసుకుంది.

ఈ సేవల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, చెల్లింపులు చేయడం, ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడం వంటి సౌకర్యాలు పొందవచ్చు. ఫీచర్ ఫోన్ వినియోగదారులకు కూడా డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు.