ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు.. ఫోన్పే కొత్త సదుపాయం
జాతీయం
ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా ఫోన్పే ‘యూపీఐ 123పే’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
2జీ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఎస్ఎంఎస్ ఆధారంగా ఈ సేవలు పనిచేస్తాయి. దీంతో దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి రానుంది.
కొత్త ఫోన్లలో యూపీఐ సేవల యాప్ ముందుగానే అందుబాటులో ఉండేలా నోకియా, లావా వంటి మొబైల్ తయారీ సంస్థలతో ఫోన్పే ఒప్పందాలు చేసుకుంది.
ఈ సేవల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, చెల్లింపులు చేయడం, ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడం వంటి సౌకర్యాలు పొందవచ్చు. ఫీచర్ ఫోన్ వినియోగదారులకు కూడా డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు.