www.ntodaynews.com
కూటమి బలోపేతానికి సమిష్టి కృషి చేయాలి
తెలంగాణ
పిఠాపురం నియోజకవర్గంలో నూతన జనసేన మండల అధ్యక్షులకు శుభాకాంక్షలు
కూటమి బలోపేతానికి సమిష్టి కృషి చేయాలి: బీజేపీ నాయకుడు చిట్టా మధు
NTODAY NEWS: పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండల రిపోర్టర్ బోరా శివారెడ్డి
పిఠాపురం నియోజకవర్గంలో కూటమిలో భాగంగా నూతనంగా ఎన్నికైన జనసేన మండల, పట్టణ అధ్యక్షులకు బీజేపీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
కూటమి భాగస్వాములైన బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి సమక్షంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఐదు మండలాలకు చెందిన వార్డు అధ్యక్షులు, బూత్ అధ్యక్షుల ద్వారా నూతన అధ్యక్షులను ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందినవారు:
గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు: మామిడాల సూరిబాబు
గొల్లప్రోలు మండల అధ్యక్షుడు: జ్యోతుల శ్రీనివాస్
పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు: డాక్టర్ రావుల వరలక్ష్మీ
పిఠాపురం మండల అధ్యక్షుడు: వెన్నా జగదీశ్
కొత్తపల్లి మండల అధ్యక్షుడు: రావు అక్షయ్
ఈ సందర్భంగా చిట్టా మధు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన జనసేన నాయకులు, వార్డు అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలందరికీ బీజేపీ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
#Pithapuram
#JanaSena
#BJP
#TDP
#AlliancePolitics
#CoalitionGovernment
#PartyOrganization
#AndhraPradeshPolitics
#GrassrootsLeadership
Follow us on
Website
Facebook
Instagram
YouTube