BREAKING
పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం. పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన కీసర ఎస్ఐ డి జ్ఞానేందర్ రెడ్డికి ముందస్తు రాఖీ శుభాకాంక్షలు తెలిపిన సహచరి ఆర్పీలు హనుమకొండ: కేయూ జంక్షన్ వద్ద ఉద్రిక్తత సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం.
www.ntodaynews.com

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటూ మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:15 AM
32 వీక్షణలు

కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిపై కేసు నమోదు.. బాధిత కుటుంబాన్ని బెదిరించినట్లు ఆరోపణలు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి ఓ మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని మాయమాటలు చెప్పిన గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు శంకర్ రెడ్డి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో ఆయన గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం.

అయితే ఈ విషయంపై శంకర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని బెదిరిస్తూ, అవమానాలకు గురిచేశాడని బాధితులు ఆరోపించారు. తన భార్యపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.