BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 20 November 2025, 04:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్యార్థిని ఇంటికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

తెలంగాణ
20 Nov, 2025 - 04:58 AM
204 వీక్షణలు
పాఠశాలకు హాజరుకాని పదవ తరగతి విద్యార్థిని సుస్మిత ఇంటికి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు... NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థి సుస్మిత పాఠశాలకు రావడంలేదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ గురువారం రోజున భువనగిరి మున్సిపాలిటీలో గల సింగన్న గూడెంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న బానోతు సుస్మిత ఇంటికి వెళ్లి ఎందుకు రోజు స్కూల్ కి వెళ్లడం లేదని సుస్మితని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సుస్మిత ఇంట్లో పరిస్థితి పై ఆరా తీశారు. ఇంట్లో వాళ్ళ అమ్మ గారికి ఆరోగ్యం సరిగా లేదని,నాన్న మేస్త్రి పనికి వెళతారని, అమ్మకి తోడుగా ఎవరు లేకపోవడం వలన ప్రతి రోజు బడికి వెళ్లలేక పోతున్నానని కలెక్టర్ కు వివరించిన సుస్మిత.కలెక్టర్ సుస్మిత ఇంటికి వెళ్లిన సమయంలో వాళ్ల అన్నయ్య అమ్మ గారిని తీసుకొని ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని సుస్మిత కలెక్టర్ కు తెలిపారు.మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు.నువ్వు మాత్రం రేపటి నుండి రోజు తప్పని సరిగా స్కూల్ కి వెళ్ళాలని,మంచిగా చదువుకోవాలని అన్నారు.విద్యార్థిని స్కూల్ కి రాని రోజు ఇంటి వద్ద నుండి చదువుకోవడానికి సదుపాయాలు సరిగా లేవని తెలుసుకొని సాయంత్రం లోపు స్టడీ చైర్. రైటింగ్ పాడ్ పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube