www.ntodaynews.com
విద్యార్థులకు యువ వికాస కార్యక్రమం
తెలంగాణ
జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి విద్యార్థులకు యువ వికాస కార్యక్రమం
NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యువ వికాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలను సమర్థవంతంగా ఎలా రాయాలనే అంశంపై అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఎంజేఎఫ్ లయన్ ఎదుల్ల అంజిరెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్రమశిక్షణ, సమయపాలన, పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన సాధించడం ద్వారా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. పరీక్షల సమయంలో భయాన్ని దూరం పెట్టి ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు.
అనంతరం విద్యార్థులకు స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సురేఖ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జనగాం రవీంద్ర గౌడ్, కార్యదర్శి రేగులగడ్డ నరసింహ గౌడ్, కోశాధికారి కొల్లోజు శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు మాధవరెడ్డి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
#Chityal #Nalgonda #LionsClub #YouthDevelopment #EducationSupport #ExamGuidance #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube