BREAKING
హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు
www.ntodaynews.com

1బి అడంగల్ నిలిపివేతతో రైతు ఆందోళన.. భూమి హక్కులపై పెరుగుతున్న సందేహాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 08:03 PM
6 వీక్షణలు

1బి అడంగల్ నిలిపివేతతో రైతు ఆందోళన.. భూమి హక్కులపై పెరుగుతున్న సందేహాలు

దస్... బీస్... తీస్... రైతు కతం హోగా?

భూమి రికార్డుల పేరుతో అన్నదాతకు కొత్త ఇబ్బందులా?

ఆంధ్రప్రదేశ్‌లో భూమి ఇప్పుడు కేవలం సాగు చేసే నేల కాదు... కోట్ల రూపాయల విలువైన ఆస్తి. అలాంటి భూమిపై పేద రైతు హక్కులు, రికార్డుల సమస్యలు రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్నాయి.

భూమి రికార్డుల్లో కీలకమైన 1బి, అడంగల్ వివరాలు అందుబాటులో లేకపోవడం లేదా నిలిపివేతకు గురికావడం వల్ల రైతులు బ్యాంకు రుణాల కోసం ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. గతంలో కూడా రికార్డుల లాక్ కారణంగా రుణాల కోసం వెళ్లిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు నమోదయ్యాయి.

రుణం కోసం బ్యాంకుకు వెళ్తే.. రికార్డు అడ్డు

ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం రైతు బ్యాంకు రుణంపై ఆధారపడతాడు. కానీ భూమి రికార్డులు సక్రమంగా లేకపోతే రుణ ప్రక్రియ నిలిచిపోతుంది.

చేతిలో భూమి ఉన్నా...

కాగితాల్లో స్పష్టత లేకపోతే రైతు పరిస్థితి ఏమిటి?

ఇదే ప్రశ్న ఇప్పుడు గ్రామాల్లో వినిపిస్తోంది.

అసైన్డ్ భూములపై పెరుగుతున్న ఆందోళన

పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుంటుందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలని కోరుతున్నారు. అసైన్డ్ భూముల బదలాయింపులపై చట్టపరమైన పరిమితులు ఉన్న విషయం తెలిసిందే.

అయితే రికార్డుల సమస్యల కారణంగా నిజమైన లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం స్పష్టమైన విధానం తీసుకురావాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

భూముల విలువ పెరిగితే.. పేద రైతుపై ఒత్తిళ్లు

నగరాల చుట్టుపక్కల భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో భూములపై వ్యాపార ఆసక్తి పెరిగింది.

రైతు మాత్రం ఒకవైపు సాగు కష్టాలు, మరోవైపు అప్పుల భారంతో సతమతమవుతున్నాడు.

భూమి అమ్మకూడదు...

రుణం తీసుకోలేడు...

సాగు కొనసాగించడానికి డబ్బు లేదు...

ఇలాంటి పరిస్థితుల్లో చిన్న రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.

చట్టం రక్షణ ఇవ్వాలా? ఇబ్బంది పెట్టాలా?

భూముల అక్రమ లావాదేవీలను అరికట్టడం అవసరమే. రికార్డుల భద్రత కూడా ముఖ్యమే.

కానీ అదే సమయంలో నిజమైన రైతుకు రికార్డులు అందుబాటులో లేకుండా పోతే, అతడి జీవనాధారమైన భూమే భారంగా మారుతుంది.

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పేద రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

రైతు చేతిలో భూమి ఉండాలి.. భరోసా కూడా ఉండాలి

ఖరీఫ్‌లో పంటపై ఆశలు...

బ్యాంకులో రుణంపై నమ్మకం...

చేతిలో భూమిపై హక్కు...

ఇవే రైతు జీవితానికి ఆధారం.

భూమి రికార్డుల సమస్యలకు త్వరిత పరిష్కారం చూపించి, రైతుకు స్పష్టమైన హక్కు కల్పిస్తారా? లేక సమస్యలు మరింత పెరుగుతాయా? అనేది ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది.

అన్నదాతకు కావాల్సింది భయం కాదు... భరోసా