2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ఇప్పటి నుంచే క్రీడా ప్రతిభను వెలికితీయాలి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: 2036 ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని దేశంలో క్రీడా వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా యువత, యువ అథ్లెట్లతో క్రీడలు, ఫిట్నెస్ అంశాలపై ప్రధాని మోడీ చర్చించారు.
దేశవ్యాప్తంగా 1,500కుపైగా కళాశాలల్లో ఖేలో ఇండియా కార్యక్రమాలను నిర్వహించినట్లు ప్రధాని తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, సౌకర్యాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు.
2036 ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే వివిధ క్రీడా విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని సూచించారు. యువత క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.