www.ntodaynews.com
29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'దివాకరన్న పెరుగున్నం' పంపిణీ కార్యక్రమం విజయవంతంగా 29వ రోజుకు చేరుకుంది.
ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ నేతృత్వంలో ఈ సేవా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పట్టణంలోని పేదలకు, బాటసారులకు ప్రతిరోజూ ఉచితంగా పెరుగున్నం పంపిణీ చేస్తూ అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సుదీర్ఘ సేవా కార్యక్రమం ఒక పవిత్ర యజ్ఞంలా సాగుతోందని, ఎండల్లో ప్రజల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ నిర్వాహకులకు స్థానిక ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన మండల మరియు పట్టణ స్థాయి నాయకులు, ట్రస్ట్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు