BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు

తెలంగాణ
/ కొమురం భీమ్ ఆసిఫాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 01:59 PM
51 వీక్షణలు

48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు

ఆసిఫాబాద్, మార్చి 29:

కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో కీలక మార్పులు చేపట్టింది. పథకం అమలు వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు సౌకర్యాలు పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే జాబ్ కార్డు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పథకం పేరును “వీబీజీ రామ్ జీ”గా మారుస్తూ, కార్మికులకు లభించే పనిదినాలను పెంచారు. వేతనాలు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆలస్యమైతే పరిహారం చెల్లించే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చారు.

అక్రమాలను అరికట్టేందుకు ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు ద్వారా క్షేత్ర సహాయకుడిని సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసిన అనంతరం, ఉన్నతాధికారుల పరిశీలన తర్వాత జాబ్ కార్డు జారీ చేయనున్నారు.

ఈ మార్పులతో ఉపాధిహామీ పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవుతుందని అధికారులు పేర్కొన్నారు.