BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

5 నెలలుగా జీతాలు లేవు.. వేతనాల కోసం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:07 PM
11 వీక్షణలు

హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు వేతనాల కోసం మహాధర్నా నిర్వహించారు. గత ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ విధులకు హాజరవుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. కుటుంబాలను పోషించడం, ఇళ్ల అద్దెలు చెల్లించడం, పిల్లల చదువుల ఖర్చులు భరించడం కష్టంగా మారిందని వాపోయారు.

తాము చేసిన పనికి తగిన విధంగా ప్రతి నెలా సమయానికి వేతనాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.