BREAKING
మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. గంజాయి మాఫియాకు పోలీసుల చెక్ జనసేనలోకి భారీ చేరికలు నవదంపతులను ఆశీర్వదించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిపిర్టియూ ఏలూరు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షునిగా సత్తెనపల్లి రాము నియామకం రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ వరం కనబడుట లేదు కుక్కలగూడూర్ గ్రామ మహిళ అదృశ్యం కూరెల్ల గ్రామంలో గ్రామదేవత బొడ్రాయి పండుగ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ సాయి దుర్గ యూత్ సంఘం
www.ntodaynews.com

55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం..

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 May, 2026 - 02:47 PM
28 వీక్షణలు

55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. సహజంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ఇథియోపియాలోని హరారీ ప్రాంతీయ రాష్ట్రం లో అరుదైన వైద్య సంఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ సహజసిద్ధంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చి వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. జన్మించిన శిశువుల్లో నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉండగా, తల్లి మరియు పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వైద్యుల వివరాల ప్రకారం, ఆ మహిళ గత 12 ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. అయితే ఎలాంటి ఐవీఎఫ్‌ లేదా ఇతర సంతానోత్పత్తి చికిత్సలు తీసుకోకుండానే సహజ గర్భధారణ ద్వారా ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం విశేషంగా మారింది.

సహజంగా ఐదుగురు పిల్లలు పుట్టడం అత్యంత అరుదైన ఘటనగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటన జరిగే అవకాశం సుమారు 55 మిలియన్లలో ఒక్కసారి మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.