www.ntodaynews.com
60 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్హౌస్ గేట్లు తెరుస్తాం: కేటీఆర్
తెలంగాణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన కన్నెపల్లి పంప్హౌస్లను ప్రభుత్వం వెంటనే ప్రారంభించకపోతే భారీ ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే 60 వేల మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్హౌస్ గేట్లు తెరుస్తామని ప్రకటించారు.
కన్నెపల్లి పంప్హౌస్ను సందర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.