BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తెలంగాణ సచివాలయంలో 6వ అంతస్తుకు భోజనాలు బంద్.. రెండేళ్లుగా బిల్లులు పెండింగ్!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 03:39 PM
49 వీక్షణలు

తెలంగాణ సచివాలయంలోని ఆరవ అంతస్తుకు భోజనాల సరఫరా నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లుగా క్యాటరింగ్ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.

గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంవో అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకు విధుల్లో నిమగ్నమై ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఇతర ఆహార ఏర్పాట్లను ప్రత్యేకంగా కల్పించింది. అయితే బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సరుకులు కొనుగోలు చేయడమే కష్టంగా మారిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

కనీసం విడతల వారీగా అయినా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల విడుదల విషయంలో అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టేసుకుంటున్నారని, దీంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ చివరకు ఆరవ అంతస్తుకు భోజనాల సరఫరాను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంపై సచివాలయ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులు, కీలక విభాగాల ఉద్యోగులు ఉండే ఆరవ అంతస్తుకే భోజనం అందని పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.