BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

తెలంగాణ సచివాలయంలో 6వ అంతస్తుకు భోజనాలు బంద్.. రెండేళ్లుగా బిల్లులు పెండింగ్!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 03:39 PM
85 వీక్షణలు

తెలంగాణ సచివాలయంలోని ఆరవ అంతస్తుకు భోజనాల సరఫరా నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లుగా క్యాటరింగ్ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.

గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంవో అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులు ఉదయం నుంచి రాత్రి వరకు విధుల్లో నిమగ్నమై ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఇతర ఆహార ఏర్పాట్లను ప్రత్యేకంగా కల్పించింది. అయితే బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సరుకులు కొనుగోలు చేయడమే కష్టంగా మారిందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

కనీసం విడతల వారీగా అయినా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల విడుదల విషయంలో అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టేసుకుంటున్నారని, దీంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ చివరకు ఆరవ అంతస్తుకు భోజనాల సరఫరాను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంపై సచివాలయ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం, ప్రధాన కార్యదర్శి, సీఎంవో అధికారులు, కీలక విభాగాల ఉద్యోగులు ఉండే ఆరవ అంతస్తుకే భోజనం అందని పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.