BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ
26 Jan, 2026 - 07:50 PM
277 వీక్షణలు
MRPS–MSP & ఏపీ దళిత సేవా సమితి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: పుంగనూరు  రిపోర్టర్ రాఘవేంద్ర రాజు MRPS, MSP మరియు ఏపీ రాష్ట్ర దళిత సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో పుంగనూరులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో MRPS ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ నాయకులు బి. నరసింహులు మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యం ఎన్నో మహానుభావుల త్యాగ ఫలితమని, స్వతంత్ర భారతదేశానికి స్వయంగా రాజ్యాంగం రచించుకోవాల్సిన అవసరం ఏర్పడిన సందర్భంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటు చేయబడిందన్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు నిరంతర కృషి చేసి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని అంబేద్కర్ దేశానికి అందించారని పేర్కొన్నారు. అలాంటి మహనీయుని స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రామయ్య మరియు ఏపీ రాష్ట్ర దళిత సేవా సంఘం అధ్యక్షుడు శంకర్ సంయుక్తంగా మాట్లాడుతూ… విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచి, మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గౌరవం తెచ్చేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించి, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. MRPS సీనియర్ నాయకులు నేతకుట్లపల్లి నరసింహులు, చెంబు నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి చదల వెంకటరమణ (చిట్టి), రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం. కృష్ణప్ప, రాష్ట్ర సెక్రటరీ చీటి గంగప్ప, జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు, దళిత నాయకులు ఏ. కుమార్, రామయ్యతో పాటు MRPS సోదరులు, దళిత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #RepublicDay #77thRepublicDay #ConstitutionOfIndia #DrBRAmbedkar #AmbedkarJayanti #SocialJustice #DalitRights #Equality #IndianDemocracy #FreedomAndEquality #ConstitutionalValues #AmbedkarIdeology #Punganur Follow us on Website Facebook Instagram YouTube