www.ntodaynews.com
ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ
కరసనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
NTODAY NEWS: పుంగనూరు
పుంగనూరు మండల పరిధిలోని కరసనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్ మాట్లాడుతూ, దేశ పౌరులందరూ భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగా జీవించాలని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్, ప్రేమ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని తెలిపారు. నేడు ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం మరియు పాలనలో భాగస్వామ్యం లభిస్తున్నదంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లేనని పేర్కొన్నారు. రాజ్యాంగమే దేశానికి వెన్నెముక అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శిరషా నాగ శంకర్ రెడ్డి, ఉపాధ్యాయులు మల్లిక, ప్రసూన, మనోహర్, రామాంజులు, శ్రీనివాసన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
#RepublicDay
#77thRepublicDay
#RepublicDay2026
#ConstitutionOfIndia
#DrBRAmbedkar
#NationalFlag
#IndianConstitution
#Patriotism
#UnityInDiversity
#JaiHind
#SchoolCelebrations
#StudentsParticipation
#Punganur
Follow us on
Website
Facebook
Instagram
YouTube