www.ntodaynews.com
మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ
మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
NTODAY NEWS: బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలంలోని వివిధ గ్రామాలలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. మండల తాహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.
తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో కార్యాలయంలో స్పెషలాఫీసర్ జ్యోతి కుమార్, రాజా త్రివిక్రమ్,వివిధ గ్రామాల నూతన సర్పంచులు గ్రామ పంచాయతీల దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడానికి భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సారధ్యంలో రచించబడిన భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందన్నారు.1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేస్తూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ సునీల్ కుమార్,ఎంపీఓ శ్రీమాలిని, పర్యవేక్షకులు జ్ఞాన ప్రకాష్ రెడ్డి, ఆర్ఐ వెంకట్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శోభారాణి,సర్వేయర్ శ్రీనివాస్, ఏ ఆర్ఐ నరేష్ నాయక్, మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube