www.ntodaynews.com
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 8వ వారం జ్ఙానమాల కార్యక్రమం
తెలంగాణ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 8వ వారం జ్ఙానమాల కార్యక్రమం.
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
ఆదివారం కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 5వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకిటి సంజీవరెడ్డి మాజి పి.ఎ.సి.యస్ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అంబేద్కర్ తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో ... కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాడిగల్ల బాబు, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ భూషపాక మల్లేష్, MRPS బీబీనగర్ మండల మాజీ అధ్యక్షుడు మొల్గరం పాండు, మాజీ వార్డు సభ్యులు మొల్గరం బాలనర్సింహ, MRPS నాయకులు మంద పెంటయ్య, మంద ఉప్పలయ్య, మంద నర్సింహ, మంద శ్రీశైలం, బొడ్డు శివబాబు, బొడ్డు భాస్కర్, మంద ప్రవీణ్, ఎడ్ల బాబు, మొల్గరం భరత్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube