బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం
NTODAY NEWS: హైదరాబాద్
ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి జ్యువలర్స్ అధినేత మానేపల్లి మురళీ కృష్ణ జన్మదినం సందర్భంగా, భారతీయ జీవిత బీమా ఏజెంట్ కౌటికే విటల్ హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళీ కృష్ణ సమీప బంధువైన ప్రియా గోల్డ్ యాజమాని బుక్క శ్రీనివాస్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బుక్క శ్రీనివాస్, కౌటికే విటల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ వంతుగా సంపాదించిన దానిలో కొంతమేర దానం చేయాలని సూచించారు. అడ్వకేట్ మడిపల్లి రవి మాట్లాడుతూ, కౌటికే విటల్ తమ పాలసీదారులకు విశేష సేవలు అందిస్తున్నారని, వారి పాలసీదారుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు అన్నసంతర్పణం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న 26 జీవిత బీమా కంపెనీలలో ఇలాంటి సంప్రదాయం ఎక్కడా లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube