ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం గుడివాడ డివిజన్ ఉపాధ్యక్షుడిగా ధారావతు. మంగయ్య
నూజివీడు పోస్టాఫీస్లో నిర్వహించిన ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం గుడివాడ డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఏపీ సర్కిల్ జనరల్ సెక్రటరీ వై. మర్రిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గుడివాడ డివిజన్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా పోలవరం పోస్టాఫీసు లో పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్న ధారావతు. మంగయ్య, కార్యదర్శిగా వి.వి.ఎస్. అజరయ్య, ట్రెజరర్ గా నాగేశ్వరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గ ఎన్నికలను ప్రకటించిన ఏపీ సర్కిల్ సెక్రటరీ వై. మర్రిరెడ్డి, ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సర్కిల్ ఏడి జి. శివనాగరాజు రాష్ట్ర సంఘం మరియు నూతన కార్యవర్గానికి పలు సూచనలు, సలహాలు అందించారు.
అలాగే గుడివాడ పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్. కృష్ణమూర్తి, నూజివీడు అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి. షణ్ముఖరావు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించి, నూతన కార్యవర్గ ఎన్నికలను ఆమోదించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డి. మంగయ్యకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.