BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 07:35 PM
47 వీక్షణలు

ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

నంద్యాల ఏప్రిల్ 8 

నంద్యాల.... ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూకలు చేస్తున్న దాడులను తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవాలను నిర్భయంగా వెలికితీసి, ప్రజల ముందు ఉంచడంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఆర్కే (రాధాకృష్ణ) గారు ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో జరుగుతున్న పరిణామాలను, వాస్తవాలను పత్రికా ముఖంగా వెల్లడించడం పట్ల ఓర్వలేక వైసీపీ నేతలు ఈ దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని ఆయన విమర్శించారు. నిజాలు బయటపడుతుంటే తట్టుకోలేక భౌతిక దాడులకు దిగడం వైసీపీ నైజమని మండిపడ్డారు. రాజధాని అమరావతిపై నిజాలు చెప్పినందుకు కార్యాలయాలపై దాడి చేయడం సమంజసం కాదని, ఇలాంటి పిరికిపంద చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పత్రికా సంస్థలపై, జర్నలిస్టులపై జరుగుతున్న ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిరోజ్ డిమాండ్ చేశారు.