BREAKING
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆరోగ్య మెరుగుకై చాట్రాయి మండల జనసైనికుల ప్రత్యేక పూజ రైల్వే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి జనార్ధనవరం గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చనుబండలో నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన గొల్లప్రోలు లో అంబరాన్నంటిన సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె… నిలిచిపోనున్న బస్సులు పోతనపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 65 ​జాతీయ రహదారిపై డీజిల్ నో స్టాక్
www.ntodaynews.com

ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
08 Apr, 2026 - 07:35 PM
25 వీక్షణలు

ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్

నంద్యాల ఏప్రిల్ 8 

నంద్యాల.... ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూకలు చేస్తున్న దాడులను తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవాలను నిర్భయంగా వెలికితీసి, ప్రజల ముందు ఉంచడంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఆర్కే (రాధాకృష్ణ) గారు ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో జరుగుతున్న పరిణామాలను, వాస్తవాలను పత్రికా ముఖంగా వెల్లడించడం పట్ల ఓర్వలేక వైసీపీ నేతలు ఈ దాడులకు తెగబడటం దుర్మార్గమన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని ఆయన విమర్శించారు. నిజాలు బయటపడుతుంటే తట్టుకోలేక భౌతిక దాడులకు దిగడం వైసీపీ నైజమని మండిపడ్డారు. రాజధాని అమరావతిపై నిజాలు చెప్పినందుకు కార్యాలయాలపై దాడి చేయడం సమంజసం కాదని, ఇలాంటి పిరికిపంద చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పత్రికా సంస్థలపై, జర్నలిస్టులపై జరుగుతున్న ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిరోజ్ డిమాండ్ చేశారు.