www.ntodaynews.com
ఆన్లైన్లో భూమి నమోదు లేకున్నా యూరియా అందుబాటులో ఉంటుంది: మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విస్సన్నపేట, జూలై 29: విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలోని ఎరువుల దుకాణాన్ని మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు, విక్రయాల రిజిస్టర్లు పరిశీలించారు.
యూరియా, డీఏపీ విక్రయాలను తప్పనిసరిగా ఏపీఎంఎస్ యాప్ ద్వారానే నిర్వహించాలని, యాప్లో నమోదు చేయకుండా విక్రయాలు చేపట్టిన ఎరువుల డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులందరూ ఏపీ ఎయిమ్స్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆన్లైన్లో భూమి నమోదు లేకపోయిన రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాంటి రైతులు తమ భూ పట్టాతో సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి యూరియా పొందవచ్చని మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి వివరించారు.