ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దాం
ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దాం --ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు
చింతలపూడి, ఏప్రిల్ 8
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చింతలపూడి అర్బన్ హెల్త్ సెంటర్ లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "విజ్ఞానానికి అండగా నిలుద్దాం! ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దాం!!" అని నినాదం చేస్తూ, ప్రజలను ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్యం మే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు సమిష్టిగా పనిచేయాలని, ప్రభుత్వ విధానాలతో ప్రతి ఒక్కరూ సహకరించాలి అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవాలని, సామాజిక బాధ్యతగా అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ గీత, కూటమి నాయకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు.