BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మధిర రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలి: సీపీఐ(ఎం)

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jul, 2026 - 06:46 AM
5 వీక్షణలు

మధిర రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలి: సీపీఐ(ఎం)

మధిర: మధిర రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ మంజూరు చేయాలని సీపీఐ(ఎం) నాయకులు విజయవాడ రైల్వే డివిజన్ డీఆర్‌ఎం మోహిత్ సోనిక్యకు వినతిపత్రం సమర్పించారు.

రైల్వే స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై శుద్ధి చేసిన తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రానిక్ కోచ్ ఇండికేటర్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

అలాగే గౌతమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సింహపురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర ప్రధాన రైళ్లకు మధిర రైల్వే స్టేషన్‌లో హాల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల కార్యదర్శులు పడకంటి మురళి, మందా సైదులు తదితరులు పాల్గొన్నారు.