ఆరుగొలనుపేటలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా
ఆరుగొలనుపేటలో పసుపు జెండా రెపరెపల మధ్య ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు.
టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పసుపు జెండాలతో గ్రామం అంతా కాంతివంతంగా మారింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా మహానేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. “తెలుగు వారి ఆత్మగౌరవం” అనే నినాదంతో ప్రారంభమైన పార్టీ సిద్ధాంతాలను స్మరించుకుంటూ, మరింత బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్దామని ప్రతిజ్ఞ చేశారు.
నినాదాలతో మార్మోగిన ఆరుగొలనుపేటలో కార్యకర్తల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.