www.ntodaynews.com
ఆర్య వైశ్య విద్యా కమిటీ రాష్ట్ర చైర్పర్సన్గా పందిరి గీత ప్రమాణ స్వీకారం
తెలంగాణ
/
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య సామాజిక విద్యా కమిటీ రాష్ట్ర చైర్పర్సన్గా చిట్యాలకు చెందిన పందిరి గీత రమేష్ శుక్రవారం హైదరాబాద్లో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలను అప్పగించినందుకు రాయపూరి భవానీ ఉమా శేఖర్, అమరావాది లక్ష్మీ నారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్గా సేవలు అందిస్తున్న పందిరి గీత, ఇప్పుడు అదనంగా రాష్ట్ర స్థాయి సామాజిక విద్యా కమిటీ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సామాజిక వర్గ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, అభినందనలు కురిపించారు.