www.ntodaynews.com
నర్సింహులపేట MPDO కార్యాలయంలో ఏసీబీ దాడులు – లంచం తీసుకుంటూ అధికారులు రెడ్ హ్యాండెడ్
తెలంగాణ
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లంచం తీసుకుంటూ ఎంపీడీఓ పెనుగొండ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
పడమటి గూడెం గ్రామంలో వెంచర్ అనుమతి కోసం రూ.1 లక్ష డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రూ.45 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి పట్టుకున్నారు.
దాడుల సమయంలో కార్యాలయంలో వ్యవహారాలు నిర్వహిస్తున్న ఎంపీడీఓ కుమారుడు రాంప్రసాద్ కూడా ఏసీబీకి చిక్కినట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.