BREAKING
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
www.ntodaynews.com

ఆస్పత్రిలో నవజాత శిశువును వదిలి వెళ్లిన తల్లికి రెండేళ్ల జైలు శిక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 May, 2026 - 06:37 PM
62 వీక్షణలు

ఏలూరులో నవజాత శిశువును ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిన ఘటనలో నిందితురాలికి గౌరవ మొబైల్ కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

లింగాపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన బొల్లిన సాయి స్వాతి 2022 జూన్ 2న పీరియడ్స్ నొప్పిగా ఉందని చెబుతూ ఏలూరు ఎన్.ఆర్.పేటలోని చైత్ర ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చి, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పసికందును ఆస్పత్రిలోనే వదిలి పరారైంది.

ఈ ఘటనపై ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ మల్లెల లక్ష్మీ శ్రీ ఇచ్చిన ఫిర్యాదుతో ఏలూరు త్రీ-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి త్రీ-టౌన్ సీఐ కేవీఎస్వీ ప్రసాద్ దర్యాప్తు చేపట్టి నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం పక్కా ఆధారాలతో మొబైల్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

విచారణ చేపట్టిన గౌరవ మొబైల్ కోర్టు జడ్జి ఎన్. మేరీ సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితురాలిపై నేరం రుజువైనట్లు నిర్ధారించారు. ఈ మేరకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఈ కేసులో ప్రభుత్వ తరఫున ఏపీపీ పి. హేమలత వాదనలు వినిపించారు.

ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ, శిశువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కేసును వేగంగా విచారించి నిందితురాలికి శిక్ష పడేలా చేసిన త్రీ-టౌన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించినట్లు వెల్లడించారు.