ఆశ వర్కర్లకు కనీస వేతనం నిర్ణయించాలి
ఆశ వర్కర్లకు కనీస వేతనం నిర్ణయించాలి-- సిఐటియు
ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అందజేయాలని ఆశ వర్కర్ల జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు మంగళవారం రోజున సిఐటియు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశ వర్కర్లకు రాష్ట్ర బడ్జెట్లో ఫిక్స్డ్ బడ్జెట్ కేటాయించాలని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ పనిచేస్తున్న ఏళ్ల తరబడిగా పట్టణాల్లో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించకుండా చాకిరి చేయించుకుంటున్నదని రాష్ట్ర బడ్జెట్లో ఆశ వర్కర్లకు బడ్జెట్ కేటాయించి ఫిక్స్డ నిర్ణయించి వేతనాలు పెంచాలని అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆశ వర్కర్లకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన నేటికీ అమలు చేయలేదని వెంటనే ఇప్పటికైనా వెంటనే బడ్జెట్ కేటాయించి ఈఎస్ఐ,పీఎఫ్ సౌకర్యం కల్పించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ,అంగన్వాడీ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర్ల వెంకటమ్మ, కసగోని లలిత, నాయకులు జ్యోతి, సంతోష, సుజాత, జమున, అరుణ, ధనలక్ష్మి, సైదమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు